భారతదేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. వాటిని అసర చేసుకొని పోరుగు దేశం మాతాల పేరుతో దేశంలో ప్రవేశిచించి దేశాన్ని క్రమంగా అక్రమిచుకునే మార్గాలను ఎంచుకుంది. అదే క్రమంలో చైనా దలైలామ పేరుతో భారతదేశం మొత్తం విసృత ప్రచారంలో ఉంది. అయితే మొదటి ఆక్రమితంలో భాగంగా కాశ్మీర్ను ఎంచుకుంది. కాశ్మీరలో కొంత భాగాన్ని డ్రాగన్ (చైనా) సైనికులు అక్రమించుకుని పాలకు సిద్దమౌతున్నారు. ఈ విషయాన్ని 1950 ప్రారంభం నుంచే నెహ్రూ చైనా నుంచి ముప్పును ఊమించారనడానికి ఇప్పుడు కావలసినన్ని సాక్షాలున్నాయి. చైనా నుంచి ఎదురుకాగల ప్రమాదం గురించి తాము నెహ్రూను హెచ్చరిస్తూనే వచ్చామని ఆయన సకాలంలో చర్య తీసుకోలేదని కొందరు నాయకులు చెప్పుకున్నారు. పండిట నెహ్రూ 1952లో తన పెంకింగ్ పర్యటన సందర్భంగా ఇలా అన్నారట. ఏదో ఒక రోజున ఈ రెండు ఆసియా మహాకాయాలూ ఒక దానితో
ఒకటి ఘర్షణకు దిగుతాయి. అది ఆసియాకే మహోత్పాతంగా విప్లవానంతరం నవచైనా ఎలా మారబోతోందో మనం దృష్టిలో ఉంచుకోవాలని 1950 నవంబర్ 27వ తేదీన నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. ఆ తరువాత 1950లో నియుక్తమైన భార్డర్ కమిటీని గురించి ప్రస్తావించి శక్తివంతమైన ఈ రెండు దేశాలు సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకొని ముఖాముఖిగా రూపొందించుకున్న చిత్రం 1950 నుంచి ప్రబుత్వం ముందు ఉంటూనే వచ్చిందనీ, అయితే, ఘర్షణ అయిదేళ్లలోనా, ముపై్పళ్లోనా అన్న విషయం కాక ఎప్పుడు సంభవిస్తుందనే విషయంలో రెండు దేశాల మద్య అభిప్రాయభేదం ఉండవచ్చునని అన్నారు. మాజీ ప్రధాని పండితుడు సర్గీయ పి.వి.నరసింహారావు లోపల మనిషి పుస్తకంలో రాసిన మాటలివి. చైనా-భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ప్రథమ ప్రధాని నెహ్రూ వేసిన అంచనా అక్టరం కూడా తప్పలేదు. ఆయన చెప్పినట్టే అసియాలోని ఆ రెండు మహాకాయాలు 1962లో తలపడ్డాయి. కూడా ఎటోచ్చి అపజయం మనదే అయింది. ``1947-64 మధ్యకాలంలో ప్రపంచదేశాల మధ్య సమున్నత స్థాయికి ఎదిగిన భారతదేశం ప్రతిష్ట 1962 నాటి సైనిక పరాజయంతో దారుణంగా కుంగిపోయింది ఇది కూడా పివి రాశాని మాటాలే... పోయిన ప్రతిష్టను భారత్ తిరిగి సాధించుకుంది. కానీ, చైనాతో మన సంబంధాలు మెరుగుపడలేదు. చైనా విస్తరణ కాంక్టలో మార్పుకనిపించడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల జరిగిన పరిణామాలు. ఉత్తర ప్రాంతాలుగా పిలుచుకునే గిల్గిత్, బాల్టిస్థాన్లలో చైనా సేనలు వచ్చి చేరుతున్నామనీ, ఆక్రమిత కాశ్మీర్ను చైనాకు అప్పగించడానికి పాకిస్థాన్ సిద్దపడుతున్నదనీ వివరిస్తూ విదేశీ మీడియా కొన్ని వార్తలు ఇచ్చింది. ఈ అంశంతో సంబంధం ఉన్న భారత్-చైనా-పాకిస్థాన్ ఈ మూడు దేశాలలో ఏ ఒక్కటీ ఈ అంశం మీద ఇంత వరకూ నోరు మెదపలేదు. కాబట్టి దీని గురించి వెంటనే నిర్ధారణకు రానవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అలాంటి వారి కోసమే పివి రాసిన మాటలు గుర్తు చేయడం. ఇంతకీ తాజా వివాదం ఏమిటి? భారత ప్రభుత్వం కూడా ఈ సంగతుల రుజువు కోసం ఎందుకు చూస్తున్నది. అదొక విచిత్రమే... ఈ సందర్భంలో కార్గిల్ ప్రాంతంలో జిరగిన ఆక్రమణలను అక్కడ పశువుల కాపరులు సైనాన్యనికి తెలియ చేస్తే గానీ భారత ప్రభుత్వం దృష్టికి రాలేదన్న సంగతి గుర్తుకు వస్తుంది.జమూ్మకాశ్మీర్లో విధులలో ఉన్న సైనికాధికారి, ఉత్తర కమాండ్ అధిపతి లెవి్టనెంట్ కల్నల్ బి.స్ జస్వాల్ ఉదంతం ద్వారా చైనా ఉద్ధేవాలను పసిగట్టవచ్చుననే అనిపిస్తుంది. జస్వాల్ ఆ దేశంలో పర్యటించేందుకు మీసా నిరాకరించింది. అందుకు చైనా చెపిపన కారణం కొత్తదేమీ కాదు. భారతీయులను విభ్రాంతికి గురిచేసేది కాదు. సరిహద్దులలో పరిణామాలు. 1949 నుంచి జరిగిన చరిత్ర పరిణామాల గురించి లోతుగా తెలిసిన వారికి ఇవన్నీ పెద్ద విస్మయం కలిగించేవి కావు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాలో పన్నుతున్న వూ్యహాలేవి కొత్తవి కావు. కల్నల్ జస్వాల్ మొన్న జూలైలో చైనాలో పర్యటించవలసి ఉంది. జస్వాల్ పర్యటనను అనుమతించడం సాధ్యం కాదని జూలై మధ్యలో ఛైనా అధికారులు కబురందించారు. కారణం-వ్యవస్థాపరంగా చైనాకు ఇబ్బంది కారకంగా ఉన్న ప్రాంతంలో జస్వాల్ పని చేస్తున్నందుకే ఈ నిర్ణయం అనివార్యమైందని దౌత్యభాష పలికింది. చైనా కల్నల్ జస్వాల్ అధికార పరిధి కాశ్మీర్లో సున్నిత ప్రాంతాలకు చెందిన వారికి చైనా ప్రభుత్వం ప్రత్యేక వీసాలు జారీ చేస్తుందని జూలై 21న భారత అధికారులకు రాసిన లేఖలో ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. నిజానికి కాశ్మీరీలకు చైనాకు మన అధికారులు నిరసన తెలియజేశారు. దానితో పాటు వేగంగా ప్రతిఘటన తెలిపింది. ఆగస్టులో భారత్ పర్యటనకు రావలసిన చైనా సీనియర్ కల్నల్, ఇద్దరు కెప్టెన్ల పర్యటనను రద్దు చేయడం ఆ ప్రతిఘటనలో భాగమే. చైనా కల్నల్ న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స కాలేజిలో ప్రత్యేకోపన్యాసం ఇవ్వవలసి ఉంది. ఆయన వెంట ఇండియా పర్యటించవలసిన కెప్టెన్లు కూడా పంచమడిలోని సైనిక కేంద్రంలో శిక్టణ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. ఈ ద్వంద్వ వీసాల వివాదం తేలే దాకా రక్టణకు సంబంధించి ఇచ్చిపుచ్చుకునే కార్యకలాపాలను నిలిపివేయాలని తీసుకున్న తీవ్ర నిర్ణయం కూడా అందుకే.
చైనా టిబెట్కు విజయవంతంగా రైలు మార్గాన్ని నిర్మించింది. ఇప్పుడు గిల్గిత్-బాల్టిస్థాణతో పాకిస్థాన్కు తలనొప్పులు ఉన్నాయి. వాటిని వదుల్చుకోవడానికి కూడా చైనా ప్రమేయాన్ని పాక్ వాంఛిస్తున్నది. అదే చైనా కోణం నుంచి చూస్తే భారత్ సరిహద్దులో కీలకమైన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడం, ఆసియాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ చుట్టూ తన ప్రాబల్యం బలపడడం దానికి ఎంతో సంతృప్తిని ఇచ్చే అంశమే. ఈ ప్రాంతలో చైనా అభివృద్ధి పథకాలు చేపట్టడంతో దాని మీద పట్టు కోసం ముందు పోటీ ఏర్పడడమూ ఖాయం. కాబట్టి కల్నల్ జస్వాల్కు వీసా నిరాకరించడం ఈ ప్రాంతంతో చైనా వేస్తున్న ఎత్తులలో భాగమే అని అర్ధం. అక్కడ పని చేస్తున్న భారత సైనికాధికారికి వీసా నిరాకరించడం అంటే సున్నిత కాశ్మీర్లో భారత్ అధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేయడమే. టిబెట్ తిరుగుబాటు(1959) తరువాత దాని మీద చైనా అధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేయాలని భారత్ ప్రయత్నించినట్లు, చైనా అనుమానం. దలైలామాకు ధర్మశాలలో ఆశ్రమాలనికి, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నివ్వడం చైనాకు ఇప్పటికీ రుచించని విషయమే. ఆ క్రమంలోనే కాశ్మీర్ మీద భారత్సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకం చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని చైనా కూడా వినియోగించుకుంటున్నది. ఇందుకు పాక్ పెద్దపావులగా ఉపయోగపడుతున్నది.చైనా వైఖరికి దాని విదేశాంగ నీతే కారణం. వాస్తవం చెప్పాలంటే చైనా విదేశ వ్యవహారాలు వన్వే ట్రావిక్ను మరిపిస్తాయి. చైనా ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే తప్ప అవతలి భాగస్వామి అభిప్రాయాలకు ఆ విధానంలో గౌరవం తక్కువ. ఇది పంచశీల భగ్నమైనప్పుడే స్పష్టంగా అర్ధమైంది. కానీ, భారత్కు విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఏ రాజ్యకూటమికి చెందకపోవటం అందులో ప్రధానమైనది. అందుకే ప్రచ్ఛన్నయుద్దంలో ఇటు కమూ్యనిస్టు, బ్లాకు వైపుగానీ, అటు అమెరికా వైపుగానీ దేశం మొగ్గుచూపలేదు. ప్రచ్ఛన్న యుద్దం అంతం తరువాత ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. కానీ, ఈ విధానంతో మనకు మేలు జరగలేదని చెప్పడం తొందరపాటే కాదు, కొంత నష్టం కూడా తెచ్చిందని చెప్పడానికి మాత్రం వెనుకాడనక్కరలేదు.
దౌత్యం అంటే భారత్కు ఏమాత్రం గౌరవం లేని ఇరుగు పోరుగుతో కాలం చెల్లిన దౌత్య వూ్యహాలను అమలు చేయడానికి ప్రయత్నించే దేశంగా భారత్ మీద ముద్ర పడింది. పాకిస్థాన్ విదేశాంగ విధానంలో భారతదేశానికి చాలా ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. భారత సరిహద్దు ప్రాంతాల మీద చైనాకూ, పాక్కూ కూడా కన్ను ఉంది. రెండూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటాయి. భారత ఉత్తర సరిహద్దులలో పాకిస్థాన్ తన ఆర్ధిక, వూ్యహాత్యక అవసరాల దృష్టా్య స్థావరాల కోసం అర్రులు చాస్తూ ఉంటుంది. అయితే పాక్ కంటె చైనా విషయంలో ఇందుకు సంబంధించిన భారత్ స్పందన ఎప్పుడూ ఎంతో బలహీనంగా పేలవంగా ఉంది. కానీ, దీని వెనుక ఉన్న చారిత్రక కారణాలను అర్ధం చేసుకోవడం కూడా ఆయా ప్రాంతాలలో ఇప్పుడు ఏ జరుగుతున్నదో తెలసుకునే ఆసక్తిని ఇండియా ఏనాడూ కనపరచలేదు. గిల్గిత్-బాల్టిస్థాన్ సాధికారత, 2009 నాటి స్వయం పాలన ఉత్తర్వు వంటి రాజకీయ ప్యాకేజి గురించి కూడా భారత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందులో భారత్కు సానుకూల పరిణామాలు ఉన్నాయి. అయినా భారత్ శ్రద్ద వహించలేదు. గిల్గత్-బాల్టిస్థాన్ల సాధికారతకు జమూ్మకాశ్మీర్లో అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాశ్మీర్కు స్వతం6తం కోరుతున్న జమూ్మకాశ్మీర్ ! లిబరేషన్ ప్రంట్ వంటి సంస్థలు, పాకిస్థాన్లో విలీనం వైపు మొగ్గు చూపుతున్న హిజ్బుల్ముజామిదీన్ ఇస్తాం వంటి సంస్థలు కూడా ఈ ప్యాకేజీకి ప్రతికూలంగా ఉన్నాయి. పాకిస్థాన్లో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ముస్లిం లీగ్ కూడా ఈ ప్యాకేజీ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఉత్తర ప్రాంతాలకు సంబంధించి (అవేగిల్గిత్-బాల్టిస్థాన్) ఏ నిర్ణయం తీసుకోవాలన్న పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజాగిలానీ కూడా నేషనల్ అసెంబ్లీని సంప్రదించవలసి ఉంటుంది.
జమూ్మ కాశ్మీర్ లిబిరేషన్ ఫ్రంట్ నాయకుడు అమానుల్లా ఖాన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉత్తర ప్రాంతం జమూ్మకాశ్మీర్లో అంతర్భాగంగా ఉండాలని చాలా చట్ట బద్దంగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు అన్ని ఉన్న ఆక్రమిత కాశ్మీర్లోనే అవి కొనసాగాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమానుల్లా ఖాణ్ గల్గిత్కు చెందినవాడు. సరిహద్దు ఉత్తర ప్రాంతాల పరిపాలన జమూ్మ-కాశ్మీర్ ప్రాంతాలు ఐక్యంగా ఉండటం అనే అంశాల మీద విభజన కాలం నుంచే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి ఈ నాటివి కావు. 1 ఆగస్టు 1947న గాంధీ శ్రీనగర్ వచ్చారు. నాటి బ్రిటిష్ ఇండియాలోని మిగిలిన భారతదేశమంతా మత కల్లోలాలతో అట్టుడుకుతున్నట్లు ఉండగా కాశ్మీర్లో స్వాతంత్య్రం దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాంధీజీ దానికి ఇచ్చిన నిర్వచనం వేరుగా ఉంది. 12 సంవత్సరాల తరువాత గిల్గిత్ ఏజెన్సీ తిరిగి కాశ్మీర్లో చేరినందుకే వారు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారని గాంధీ చెప్పారు. ఇదే కీలకమైన పరిణామం. గిల్గిత్పై 60 సంవత్సరాల అధికారం వెలుగబెట్టడదనికి ఉద్ధేశించిన ఒక ఒప్పందం మీద 1935లో మహారాజా హరిసింగ్(కరణ్సింగ్ తండ్రి), బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఆ ప్రాంతంలో పెరుగుతున్న రష్యా ప్రభావానికి గండి కొట్టడానికి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని సరిహద్దు రక్టణరేఖగా ఉపయోగించదలిచింది. అయితే 1947లో బ్రిటిష్ పాలన అంతంకావడంతో ఈ ఒప్పందం రద్దయింది. ఆ సందర్భంలోనే గాంధీజీ మరొక ప్రకటన చేశారు. జమూ్మకాశ్మీర్ రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు వీలుగా గిల్గిత్ను స్థానిక ప్రజలకు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించాలనీ, తద్వారా అక్కడి సంప్రదాయాలనూ, సంస్కృతినీ రక్షించాలనీ ఆయన అన్నారు. కానీ, గాంధీజీ మాటలను రాజా హరిసింగ్ పరిగణలోకి తీసుకోలేదు. తన సైనికాధికారి బ్రిగేడియర్ ఘనసారా సింగ్ను ఆ ప్రాంత గవర్నర్గా నియమించారు. కానీ, కొద్ది రోజులకే తిరుగుబాటు చెలరేగింది. గవర్నర్ను అరెస్టు చేశారు. అక్కడి చైనిక విభాగాధిపతి మేజర్ స్కాట్ తిరుగుబాటుదారుల పక్టం వహించాడు. ఆ ప్రాంతానికి 1 నవంబర్1948 నుంచి పాకిస్థాన్ వాస్తవిక పాలకురాలైంది. 1949లోనే మళ్లీ ప్రభుత్వానికీ, దాని ఆధీనంలో న్న ఆక్రమిత కాశ్మీర్ పాలకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని మేరకు ఉత్తర ప్రాంతాల మీద అధికారం పాకిస్థాన్ పరమైంది. రాష్ర్టం నుంచి ఆ విధంగా ఉత్తర ప్రాంతం వేరైంది. ఈ ప్రాంతానికి ఆప్ఘానిస్థాన్, చైనా, భారత్ ఆధీనంలో ఉనన కార్గిల్ సరిహద్దులుగా ఉన్నాయి.
చైనాతో లాభకమైన సంబంధాలకు ఈ ప్రాంతం మీద అధిపత్యం కలిగి ఉండడం పాకిస్థాన్కు అవసరం. అయితే చైన వైరం భిన్నమైనదని అంగీకరిస్తూనే మనకు శత్రువులుగా ఉన్న మన రెండు పోరుగు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహం, ఫలితంగా ముందు ముందు తలెత్తే క్లిష్టపరిస్థితి దానితో మన ప్రయోజనాలకు కలిగే విఘాతం గురించిన సమస్య అన్ని గుర్తుంచుకోవాలి. 2మార్చి 1963న చైనా-పాక్ల మధ్య జరిగిన ఒప్పందం ఈ ప్రాంతంలో 2700 చదరపు కిలోమీటర్ల భూబాగాన్ని చైనాకు అప్పగించడానికి మార్గం ఏర్పరచింది. 1982లో పాకిస్థాన్, చైనా ఉమ్మడిగా కారాకోరమ్ జాతీయ దరహదారిని నిర్మించారు. ఈ రహదారి పోడవు 900 కిలోమీటర్లు కావడం వల్ల మధ్యలో పంజాబ్లో సారవంతమైన పంజాబ్ ప్రాంతం సరిహద్దుకు , చైనాలోని జియాంగ్ ప్రాంతానికి లంకె ఏర్పడింది. ఇది రెండు దేశాల ఆర్ధిక పరిపుష్టికే కాక, స్నేహం పెంపొందడానికి కూడా దోహదం చేసింది. అలాగే జియాంగ్ ప్రాంతంలో నివసించే యుఫర్ జాతీయులకు, కాశ్మీర్ ఉత్తర సరిహద్దు ప్రాంత ప్రజలకు మధ్య స్నేహ సంబంధాలకు కూడా ఈ రహదారి కారణమైంది. ఈ జాతీయ రహదారి కారణంగానే పాకిస్థాన్లోని బలూచిస్థాన్ వద్ద గ్వదాల్ నౌకశ్రయం నిర్మాణం సాధ్యమైంది. ఈ నౌకాశ్రయాన్ని కూడా పాకిస్థాన్ చైనా ఇంజనీర్లే కలిసి నిర్మించారు. అరేబియా సముద్ర తీరంలో ఏర్పాటైన ఈ నౌకాశ్రయం వల్ల పశ్చిమ చైనా సముద్రమార్గంతో అనుసంధానమైంది. ఆవ్రికా నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకోవడానికి కూడా చైనాకు ఈ నౌకాశ్రయం దోహద చేస్తున్నది. గల్ఫకు చేరడం కూడా చైనాకు సులభమవుతోంది. మొత్తంగా చూస్తే ఈ ప్రాంతంలో చైనా తన అధిపత్యాన్ని సుదూరంగా విస్తరిస్తున్న విషయం అర్ధమవుతుంది. ఆఖరికి శ్రీలంకలో కూడా ఒక నౌకాశ్రయాన్ని నిర్మించాలని అది ప్రణాళికలు వేసుకుంటోంది. అక్కడితో చైన విస్తరణ కాంక్ట అగిపోలేదు.ఏమైనా ఆక్రమిత కాశ్మీర్లో చైనా సైన్యం ప్రవేశం ఆసియాకే పెద్ద సమస్య దీనిని ప్రపంచ, ఐక్యరాజ్య సమితి ఎంత తొందరగా గుర్తిస్తే అత మంచిది. ఇప్పటికే ప్రచ్చన్నయుద్దం మిగిల్చిన విషాదంతో ఆసియా అల్లకల్లోమైంది. ఇప్పుడు చైనా దుడుకుతనం దానిని మరింత తీవ్రం చేస్తుంది.
































